నేడు ఐక్యతా విగ్రహానికి ప్రధాని నివాళ్లు

by  |
నేడు ఐక్యతా విగ్రహానికి ప్రధాని నివాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడు. ఈ సందర్భంగా శనివారం గుజరాత్‌లోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రభుత్వం ఏక్తా దివస్ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించనున్నారు. అంతేగాకుండా ఈ సందర్భంగా ఐక్యతా విగ్రహ వైబ్‌సైట్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభం చేయనున్నారు. ఈ క్రమంలో అండమాన్ & నికోబార్ పోలీసులు ఆకట్టుకునే ఉత్సవ పరేడ్ నిర్వహించనున్నారు.


Next Story

Most Viewed