రైతుల తరహా ఉద్యమం చేయాలి : మెహబూబా ముఫ్తీ

by  |
Former CM of Jammu and Kashmir Mehbooba Mufti
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి తీసుకురావడానికి, ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం పోరాడుతున్నామని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు. వీటికోసం యాచకుల్లా అడుక్కోమని, పోరాడి సాధిస్తామని అన్నారు. ‘జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు బాగాలేవు. కశ్మీర్ సమస్యకు పరిష్కారాన్ని, మనమంతా కోల్పోయిన ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం పీడీపీ పోరాడుతున్నది. ఇందుకోసం కశ్మీరీలు పోరాడాలి. దీనికోసం కశ్మీర్ ప్రజలు ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనల తరహాలోనే పోరాడాలామో. ఎందుకంటే ప్రపంచం వారి గళాలను వింటున్నది’ అని బారాముల్లాలో మాట్లాడుతూ పేర్కొన్నారు.

Next Story