కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ మృతి..

by  |
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు.

వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతిచెందారు. దాదాపు 32 సంవత్సరాల పాటు ఆర్జేడీలో కొనసాగిన రఘువంశ్ ప్రసాద్.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2004-09 మధ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపశిల్పిగా కూడా పేరొందారు.

Read Also…

కాంగ్రెస్‌లో అటెన్షన్ అందుకేనా..?

Next Story

Most Viewed