రైతులను సంఘటితం చేయాలి : జేడీ లక్ష్మీనారాయణ

by  |
రైతులను సంఘటితం చేయాలి : జేడీ లక్ష్మీనారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్య‌వ‌సాయ చ‌ట్టాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్, హర్యానా రైతులు ఎక్కువ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతులకు ఇన్‌పుట్ గ్రాస్ తగ్గించి మార్కెటింగ్ పెంచితే ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాలతో మద్దతు ధర పోతుంది అన్నది రైతుల ఆందోళన అని, మద్దతు ధర కల్పిస్తామని కేంద్రం హామీ ఇస్తోందని గుర్తుచేశారు. దీనిపై రైతులను సంఘటితం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రైతు సంస్థలను కార్పొరేట్ స్థాయికి పెంచాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను కార్పొరేట్ సంస్థలు తీసుకోవని, పండించిన పంటలను మాత్రమే తీసుకుంటాయని తెలిపారు. భూములు పోతాయన్నది అపోహ మాత్రమే అని వెల్లడించారు.

Next Story

Most Viewed