- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో : రాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ బీబీ హరిచందన్ను కోరారు. విజయవాడలోని రాజ్భవన్లో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇతర నేతలతో కలిసి గవర్నర్తో భేటీ అయ్యారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ సాంప్రదాయాలను కించపరుస్తోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం దురాగతాలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు. గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, రాష్ట్ర కోశాధికారి సత్యమూర్తి, రాష్ట్ర వీహెచ్పీ కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, తురగా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
షాకింగ్.. చెత్త ట్రాక్టర్లో గణేష్ విగ్రహాల తరలింపు..
Next Story