- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల అఫిడవిట్లో చూపిన ఆస్తులపై నందమూరి లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదు చేసిన కేసు ఈ నెల 21కి వాయిదా పడింది. 1987 నుంచి 2005 వరకూ చంద్రబాబు తన వ్యక్తిగత ఆస్తులను అక్రమంగా సంపాదించినట్లు లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయితే, ఆ సమయంలోనే ఏసీబీ కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగా.. చంద్రబాబు నాయుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.
ఇటీవల ఆ స్టే గడువు ముగియడంతో.. ఈ కేసు అంశం శుక్రవారం విచారణకు వచ్చింది. కాగా, వాదోపవాదాల అనంతరం మరల విచారణను 21కి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజా, మాజీ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ వేగవంతం కావడంతో శుక్రవారం చంద్రబాబు అక్రమాస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది.
Next Story