- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దేవరకొండ: దేవర కొండలోని కుర్మేడ్ గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ షాప్ యజమానిపై ఓ రైతు ఫోర్జరీ కేసు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం… కుర్మేడ్ గ్రామానికి చెందిన జడ మంగయ్యకు గ్రామం లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతా ఉంది. కాగా అతని ఖాతా నుంచి ఈ నెల 7న రూ.6వేలు విత్ డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో సదరు బ్యాంకును సంప్రదించాడు.
అయితే అదే గ్రామానికి చెందిన తిరుమల ఎరువులు, విత్తనాల దుకాణం యజమాని రాచకొండ ప్రసాద్ అకౌంట్కు ఆ డబ్బులు బదిలీ అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో ప్రసాద్ను అడగ్గా తాను సర్పంచ్ భర్తనని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడు. దీంతో వారు ఈ నెల 11 న అతనిపై ఫిర్యాదు చేసారు. పోలీసులు విచారణ జరిపి ఫోర్జరీ జరిగినట్టు నిర్దారించారు. దీంతో ప్రసాద్ పై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.