అడవి పందుల వేటకు గ్రీన్ సిగ్నల్..

by  |
అడవి పందుల వేటకు గ్రీన్ సిగ్నల్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను కాల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని లైసెన్స్‌డ్ షూటర్ల బృందం స్వాగతించింది. ఎలాంటి రుసుము తీసుకోకుండా ఈ పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాల్చివేతకు అనుమతి ఉన్న 30 మంది షూటర్ల ఎంపానెల్ జాబితాను అటవీ శాఖ ఇప్పటికే వ్యవసాయ, హార్టీకల్చర్, పంచాయితీ రాజ్ శాఖలకు పంపింది. వీరిలో కొంత మంది గురువారం అరణ్య భవన్‌లో ఉన్నతాధికారులను కలిశారు. రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్న అడవి పందుల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, అటవీ శాఖ ఆదేశాల మేరకు తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ పీసీసీఎఫ్ఆర్ శోభకు లేఖను అందచేశారు.

సాధ్యమైనంత వరకు గ్రామ పంచాయితీల నుంచి అనుమతి వచ్చిన 48 గంటల్లోగా పని చేస్తామని హామీ ఇచ్చారు. కొద్ది మంది షూటర్లు పందుల కాల్చివేతకు రుసుము డిమాండ్ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, తాము అందులో భాగం కాదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా సొంత ఖర్చుతో, స్వచ్ఛందంగా ఈ పని చేస్తామని తెలిపారు.


Next Story

Most Viewed