రాహుల్​ కోసం… భాగ్యలక్ష్మి టెంపుల్‌లో పూజలు

by  |
Bhagyalakshmi Temple,
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, దేశ మాజీ ప్రధాని మన్మోహన్ కరోనా నుంచి కోలుకోవాలని కాంగ్రెస్ నేతలు పూజలు చేశారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నేతృత్వంలో ఈ పూజలు చేశారు. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌తోపాటు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్​ వచ్చిన వారంతా వెంటనే కోలుకోవాలంటూ యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్, అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్, ఓబీసీ సెల్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ జగన్ లాల్ నాయక్, యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ అధ్యక్షుడు రోహిత్ తదితరులు పూజలు నిర్వహించారు.

Next Story

Most Viewed