ఉచితంగా ఫుడ్ కిట్స్ డోర్ డెలివరీ.. కేరళ సీఎం ప్రకటన

by  |
ఉచితంగా ఫుడ్ కిట్స్ డోర్ డెలివరీ.. కేరళ సీఎం ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ సీఎం పినరయి విజయ్ కీలక ప్రకటన చేశారు. కరోనా రోగులకు, బాధిత కుటుంబాలకు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఉచితంగా ఫుడ్ కిట్స్ హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్నారు. స్థానిక ప్రభుత్వ సంస్థలు, ప్రజా రెస్టారెంట్లు, కమ్యూనిటీ కిచెన్స్ ద్వారా ఉచితంగా ఆహారాన్ని అందిస్తామని తెలిపారు.

సెకండ్ వేవ్ చాలా బలంగా ఉందని, అందరూ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని విజయన్ సూచించారు. లాక్ డౌన్ వల్ల ఆహారం కోసం ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Next Story

Most Viewed