ఉధృతంగా కృష్ణమ్మ పరవళ్లు

by  |
ఉధృతంగా కృష్ణమ్మ పరవళ్లు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్ : జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఉమ్మడి మహబూబ్‎నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‎ఫ్లో 3,86,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 3,69,690 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులకు గానూ, ప్రస్తుతం 318.010 అడుగుల ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి 9.57 టీఎంసీల నీటికి.. ప్రస్తుతం 8.631 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


Next Story