ఉత్తరాఖండ్‌లో ఇది బాధాకరం

by  |
ఉత్తరాఖండ్‌లో ఇది బాధాకరం
X

దిశ, వెబ్ డెస్క్: వరద నీటిలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజుల నుంచి అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గ్రామాల్లోకి చేరుకుంటుంది. ఈ క్రమంలో పిథోరాగ్ జిల్లాలోని మడ్ కట్ గ్రామంలోకి వరదలొచ్చాయి. దీంతో ఈ వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతిచెందారు. మరో పదకొండు మంది కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ టీం సహాయక చర్యలను చేపట్టినట్లు సమాచారం.

Next Story

Most Viewed