భారీ వర్షాలకు నిండుకుండలా ప్రాజెక్టులు

by  |
భారీ వర్షాలకు నిండుకుండలా ప్రాజెక్టులు
X

దిశ, వెబ్‎డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీ వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 7,49,807 క్యూసెక్కలుగా కొనసాగుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల ప్రాజెక్టు వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 61,240 క్యూసెక్కులు కొనసాగుతుండగా.. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్‎ఫ్లో 3,91,416, ఔట్‎ఫ్లో 4,11,885 క్యూసెక్కులు కొనసాగుతున్నాయి.

కాగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 3,69,866 క్యూసెక్కులు… పులిచింతల వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 5,47,418 క్యూసెక్కులుగా ఉంది. వంశధార నదికి వరద నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముంపు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Next Story

Most Viewed