స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్.. ఫెస్టివల్ సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్!

by  |
Flipkart
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేక ఫెస్టివల్ ఆఫర్ సేల్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ‘మొబైల్స్ బొనాంజా సేల్’ పేరుతో స్మార్ట్‌ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లను అందించనుంది. ఐదు రోజుల వరకు ఉండే ఈ మొబైల్ బొనాంజా విక్రయాన్ని ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్లను ఇస్తోంది. ఈ నెల 23 వరకు ఉండనున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లతో పాటు మొబైల్ యాక్సెసరీస్ ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది.

ఐఫోన్ 12మినీ, పోకో ఎం3, మోటో జీ 60, ఇన్ఫినిక్స్ హాట్ 10 ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్ సహా, ఐఫోన్ 12, ఒప్పో ఎఫ్ 19, రియల్ మీ సీ20 లాంటి మోడళ్లపై ప్రీపెయిడ్ డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తోంది. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై వినియోగదారులకు తక్షణ డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 12 మినీ మోడల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 69,900 ఉండగా రూ. 59,999 కే అందిస్తోంది. అదేవిధంగా ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్ స్మార్ట్‌ఫోన్ ధరను కేవలం రూ. 34,999కే అందిస్తోంది.



Next Story

Most Viewed