ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం

by  |
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ర్యాంపు వద్ద కృష్ణానదిలో ఐదుగురు యువకులు ఈతకు వెళ్లి గల్లంతు కాగా ఒకరు సురక్షితంగా బయటకు వచ్చారు. స్థానికుల సమాచారంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన గజ ఈతగాళ్లు, అధికారులు.. వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈతకు వెళ్లినవారిని కంకిపాడు మండలం వైకుంఠపురం వాసులుగా చెబుతున్నారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది.


Next Story

Most Viewed