- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా భూతం ఏపీలో భయానకం సృష్టిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మింగేసింది. రెండు వారాల వ్యవధిలో మూడు తరాల వారిని బలితీసుకున్నది. ఓ ఇంట్లో 16 మందికి కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారిలో ఐదుగురు మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెంలో ఓ ఇంటిలో 16 మందికి ఇటీవల కరోనా సోకింది. దీంతో వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారిలో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. 15 రోజుల వ్యవధిలో ఐదుగురు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story