యాదగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

by  |
యాదగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో వస్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. యాదగిరి జిల్లాలోని షాపూర్ తాలుకా వద్ద కూలి పనుల కోసం కూలీలు ఆటోలో వెళుతుండగా.. వేగంగా వస్తున్న ఓ లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed