ఐదుగురి ప్రాణాలు తీసిన టిప్పర్

by  |
ఐదుగురి ప్రాణాలు తీసిన టిప్పర్
X

దిశ, వెబ్‌డెస్క్ : బుధవారం ఉషోదయం విషాదాన్ని మోసుకొచ్చింది. రోడ్డెక్కిన వారిని టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. ఏపీలోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాలు ఎలా జరిగాయంటే..

కర్నూలు జిల్లా నంద్యాలలో తీవ్ర విషాదం నెలకొంది. బైక్ పై వెళ్తున్న తల్లీకొడుకును నంద్యాల బైపాస్ రోడ్డులో అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సువర్ణ, అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు నంద్యాల నుంచి కౌలూరుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఐదులాంతర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఆటోను టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చిన వారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసునమోదు చేసుకుని విచారిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.



Next Story