జియాగూడలో దొంగల బీభత్సం.. వరుసగా ఐదు ఇళ్లలో చోరీ

by  |
Thieves, Hyderabad
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్థరాత్రి వరుసగా ఐదు ఇళ్లలో చోరీ జరిగింది. ఐదు ఇళ్లలో కలిపి మొత్తం రూ.20 లక్షల నగదు, 45 తులాల బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధితుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story