‘ఫిట్‌నెస్’ ప్రియులతో మోడీ చిట్‌చాట్..

by  |
‘ఫిట్‌నెస్’ ప్రియులతో మోడీ చిట్‌చాట్..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జరుపుకున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ సహా ఫిట్నెస్ ప్రియులతో ప్రధాని మోదీ చిట్‌చాట్ చేశారు. ఫిట్‌నెస్ ఔత్సాహికుల సహాయంతో తయారుచేసిన ‘ఫిట్ ఇండియా ఏజ్ తగిన ఫిట్‌నెస్ ప్రోటోకాల్స్‌’ను పీఎం మోడీ ప్రారంభించారు.

5-18 ఏళ్ల నుంచి18-65 సంవత్సరాల, మరియు 65 ప్లస్ ఏజ్ కేటగిరీల నుంచి మూడు వయసుల వారికి ఫిట్నెస్ కీలకమని మోడీ అన్నారు. కరోనా కారణంగా ప్రతీ వయసు వారికి అవసరమైన ఉద్యమంగా ఇది మారిందన్నారు. ‘ఫిట్నెస్‌ డోస్ ఆదా గంటా రోజ్’ (రోజూ అరగంట కొరకు ఫిట్నెస్ అవసరం) అని పీఎం తెలిపారు. ఫిట్ ఇండియా హిట్ ఇండియా అంటూ కొత్త డైలాగ్‌ను ప్రధాని మోడీ వెల్లడించారు.


Next Story

Most Viewed