విషాదం.. చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

by  |
విషాదం.. చేపల వేటకు వెళ్లి జాలరి మృతి
X

దిశ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలరి వలలో చిక్కుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక SI రాము తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన తోకల నర్సయ్య(45) రోజు మాదిరిగానే మంగళవారం రోజున చేపల వేటకు వెళ్లాడు.

ఈ క్రమంలో చేపలు పట్టే వలలో చిక్కుకొని నీట మునిగి మరణించడాని తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు.

Next Story