ఏపీలో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

by  |
ఏపీలో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యేకి కరోనా సోకడం ఏపీలో తొలిసారి. విజయనగరం జిల్లా ఎస్.కోట శాసనసభ్యుడు కడుబొండ శ్రీనివాసరావుకు కరోనా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే గన్ మెన్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం విశేషం. శ్రీనివాసరావు ఇటీవలే వ్యక్తిగత పని నిమిత్తం అమెరికా వెళ్లి కొన్నాళ్లుండి వచ్చారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి హోం క్వారంటైన్‌లో కూడా ఉన్నారు. అనంతరం నిర్వహించిన ట్రూనాట్, ఆర్డీ ఆర్పీ రెండు టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం వైజాగ్ శివార్లలోని ఒక గెస్ట్ హౌస్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.

Next Story

Most Viewed