షాకింగ్.. ఆర్టీసీ బస్సును తగలబెట్టిన దుండగులు..!

by Batti.Sumithra |

<p>దిశ, నూగురు వెంకటాపురం: వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోని పార్కింగ్ చేసి ఉన్న భద్రాచలం డిపోకు చెందిన ఒక బస్సులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. బస్సు వెనుక చక్రం భాగంలో మంటలు రేగి ఒక సీటు దగ్ధమైంది. ప్రయాణికులను తరలించే బస్టాండ్ సమీపంలో ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో భారీ నష్టాన్ని తప్పించారు. గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారా అంటూ ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తం [&hellip;]</p>

షాకింగ్.. ఆర్టీసీ బస్సును తగలబెట్టిన దుండగులు..!
X

దిశ, నూగురు వెంకటాపురం: వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోని పార్కింగ్ చేసి ఉన్న భద్రాచలం డిపోకు చెందిన ఒక బస్సులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. బస్సు వెనుక చక్రం భాగంలో మంటలు రేగి ఒక సీటు దగ్ధమైంది. ప్రయాణికులను తరలించే బస్టాండ్ సమీపంలో ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో భారీ నష్టాన్ని తప్పించారు. గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారా అంటూ ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. మావోయిస్టుల పనేనంటూ పలురువు ఆరోపించడం గమనార్హం.

Next Story