మంటల్లో లక్ష్మీదేవి సజీవ దహనం

by  |
మంటల్లో లక్ష్మీదేవి సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం నాయక్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని లక్ష్మీదేవి అనే మహిళ సజీవదహనం అయ్యింది. మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో వారిని దగ్గరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహిళ సజీవదహనం కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed