బైంసా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా ఎగబడ్డ మంటలు

by  |
బైంసా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా ఎగబడ్డ మంటలు
X

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పాత ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద గల కృషి కాటన్ జిన్నింగ్(ఎస్.ఎస్ జిన్నింగ్)లో అగ్ని ప్రమాదం సంభవించింది. గత కొన్ని రోజుల నుంచి కొంటున్న పత్తి మొత్తం మంట పాలైంది. దీంతో స్థానిక అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీ 100 మీటర్ల పరిధిలో మొత్తం పొగతో కమ్ముకుంది. కాలిపోయిన పత్తి విలువ అక్కడ స్థానికులు తెలిపిన దాని ప్రకారం దాదాపు రూ.60 లక్షల నుంచి కోటి వరకు ఉండొచ్చని తెలిపారు.



Next Story