అర్థరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

by  |
siddhipeta-govt
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ ఐసీయూ సెంటర్ లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదాన్ని గమనించిన వైద్య సిబ్బంది వెంటనే ఆసుపత్రిలోని ఫైర్ సేఫ్టీ సిలిండర్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, వైద్య పరికరాలు, మిషనరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఐసీయూ సెంటర్ లో చికిత్స పొందుతున్న పేషెంట్లను వైద్య సిబ్బంది వెంటనే మరో వార్డుకు షిఫ్ట్ చేశారు. ఈ సంఘటనతో రోగులు, వైద్య సిబ్బంది ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.


Next Story

Most Viewed