ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన పరుపుల గోదాం

by  |
ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన పరుపుల గోదాం
X

దిశ, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ మన్సూరాబాద్ న్యూ ఫ్యాషన్ బెస్ట్ వర్కర్స్ పరుపుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 7.30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హయత్ నగర్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఇద్దరు వర్కర్లు మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారు కూడా ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో భయంతో బయటికు పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని గోదాం యజమాని తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story

Most Viewed