అగ్నిప్రమాదంలో ఐదు ఇళ్లు దగ్ధం

by  |
అగ్నిప్రమాదంలో ఐదు ఇళ్లు దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్యాస్ పేలుడు దాటికి పక్కనున్న పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంతో ఐదు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డునపడ్డాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపుచేసింది.



Next Story