విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

by  |
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
X

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈ సమయంలో మార్కెట్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. మార్కెట్‌లో పర్నీచర్ ఎక్కవగా ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed