బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం

by  |
బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (ట్రిపుల్ ఐటీ)లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. క్యాంపస్ లోని అకాడమిక్ బ్లాక్-1లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో బ్లాక్ లో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లాక్ డౌన్ కారణంగా ట్రిపుల్ ఐటీకి సెలవులు కొనసాగుతున్నాయి. ఒకవేళ వర్కింగ్ డేస్ అయి ఉంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని ఆందోళన చెందుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు.

Next Story

Most Viewed