ఊరికెళ్లిన భార్యాపిల్లలు.. ఆ మత్తులో ఇంటికి నిప్పు పెట్టిన భర్త

by  |
ఊరికెళ్లిన భార్యాపిల్లలు.. ఆ మత్తులో ఇంటికి నిప్పు పెట్టిన భర్త
X

దిశ, శంషాబాద్ : మద్యం మత్తులో ఇంటికి నిప్పు పెట్టిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మస్తాన్ అలీ, అతని భార్య సమీనా బేగంకు గత 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త మస్తాన్ అలీ నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. రెండు రోజుల క్రితం భార్య సమీనా బేగం బంధువుల ఇంటికి పిల్లలను తీసుకొని వెళ్ళింది. మస్తాన్ అలీ ఎప్పటిలాగే మద్యం సేవించి ఇంటికి వచ్చి మద్యం మత్తులో ఇంట్లో పెట్రోల్ పోసి ఇంటిని పూర్తిగా తగలబెట్టాడు. ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్, ఫర్నీచర్, బట్టలు అన్ని పూర్తిగా ఖాళీ పోయాయి. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు భార్య సమీరా బేగంకు చెప్పడంతో భార్య అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Next Story

Most Viewed