మంటల్లో పంజాగుట్ట ఫ్లై ఓవర్

by Vadlamudi Anukaran |   (  Updated:2025-08-26 05:48:17  IST  )

<p>దిశ ప్రతినిధి, మేడ్చల్ : హైదరాబాద్‌‌లోని పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింది భాగంలోని ఉన్న పిల్లర్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకొని.. తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంతో పంజాగుట్ట-జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డు మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిపడుతుండడంతో ట్రాఫిక్ అధికారులు వాహనాలను నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, […]</p>

మంటల్లో పంజాగుట్ట ఫ్లై ఓవర్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : హైదరాబాద్‌‌లోని పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింది భాగంలోని ఉన్న పిల్లర్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకొని.. తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంతో పంజాగుట్ట-జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డు మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిపడుతుండడంతో ట్రాఫిక్ అధికారులు వాహనాలను నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Video Link

Next Story