మాస్క్ ధరించకపోతే జరిమానా: ఎస్పీ చేతన

by  |
మాస్క్ ధరించకపోతే జరిమానా: ఎస్పీ చేతన
X

దిశ, మహబూబ్‎నగర్: మాస్క్‌లు లేకుండా బయట తిరిగితే రూ.1000 జరిమానా తప్పదని నారాయణపేట జిల్లా ఎస్పీ. డాక్టర్ చేతన హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న పలువురిని పట్టుకుని జరిమానాలు విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారించడానికి తెలంగాణలో ఈ నెల 29వ తేది వరకు లాక్‎డౌన్‎ను పొడిగించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని ఎస్పీ చేతన సూచించారు.

tag: SP Dr Chetana, comments, Corona mask, narayanpet

Next Story

Most Viewed