కానిస్టేబుల్‌ కుటుంబానికి చేయూత

by  |
కానిస్టేబుల్‌ కుటుంబానికి చేయూత
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాజేంద్రనగర్‌ పీఎస్‌ కానిస్టేబుల్ హరీశ్ 2నెలల క్రితం కరోనా బారిన పడి చనిపోగా అతని కుటుంబాన్ని తోటి పోలీసులు ఆదుకున్నారు. నలుగురు పిల్లల పేరు మీద రూ.8లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. (రాజేంద్రనగర్ పీఎస్ సిబ్బంది రూ4.50లక్షలు, 2007 కానిస్టేబుల్ బ్యాచ్ రూ.2.30లక్షలు, మాదాపూర్ పీఎస్ సిబ్బంది రూ.70వేలు, కానిస్టేబుల్ నివసించే బండ్లగూడ యాదాద్రి టౌన్ షిప్ కాలనీ వాసులు రూ.50వేలు). ఈ మొత్తాన్ని రాజేంద్రనగర్, మాదాపూర్ స్టేషన్ల సిబ్బందితో పాటు బ్యాచ్ మెట్స్ సమక్షంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేతుల మీదుగా హరీష్ భార్య, పిల్లలకు బాండ్లను అందజేశారు.

Next Story