హరీష్ మరణం బాధాకరం: ఎంపీ ధర్మపురి

by  |
bandi-sanjay11
X

దిశ, మల్లాపూర్: పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త జంబుక హరీష్ (29) ఈనెల 18న మృతిచెందాడు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రవేశపెట్టిన అరవింద్ ధర్మపురి వెల్ఫేర్ ఫండ్ (కార్పస్ ఫండ్) స్కీమ్ కింద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ. లక్షా 50 వేల చెక్కును అందజేశారు. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో క్రియాశీల కార్యకర్త జంబుక హరీష్ మరణించడం చాలా బాధాకరమని, హరీష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు, కోరుట్ల నియోజకవర్గ ఇన్ చార్జ్ జేఎన్ వెంకట్, మల్లాపూర్ మండల అధ్యక్షుడు ముద్దం సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed