అజ్ఞాతం వీడిన పోసాని.. వారి కంటపడకుండా తప్పించుకు తిరుగుతూ

by  |
అజ్ఞాతం వీడిన పోసాని.. వారి కంటపడకుండా తప్పించుకు తిరుగుతూ
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు, నిర్మాత, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి గత కొద్దీ రోజులు క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ పోసాని మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ అభిమానులు పోసానిపై దాడికి ప్రయత్నించారు. అనంతరం పోసాని ఇంటిపై కూడా రాళ్ల దాడి చేశారు. దీంతో కొన్నిరోజులు పోసాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. షూటింగ్లు కూడా వదిలేసి వెళ్లడంతో నిర్మాతలు ఆయనపై ఫైర్ అయ్యారు.

ఇక ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన మా ఎలక్షన్స్ లో ఒక్కసారిగా పోసాని ప్రత్యేక్షమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. తన ఓటు హక్కును వినియోగించుకున్న పోసాని ఎవరితోనూ మాట్లాడకుండా, మీడియా కంట పడకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. షూటింగ్లు మానేసి సినిమాలకు దూరమయ్యారా..? ఇలా ఎన్నిరోజులు అజ్ఞాతంలో ఉంటారు..? అనే అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. మరి పోసాని ఎందుకు బయటికి రావడం లేదు..? ఎవరికైనా భయపడుతున్నాడా..? లేక మరేదైనా కారణమా..? అనేది తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed