ఆర్టిఫిషియల్​ ఇంటెలెజెన్స్ ద్వారా మార్పులు

by  |
ఆర్టిఫిషియల్​ ఇంటెలెజెన్స్ ద్వారా మార్పులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టిఫిషియల్​ ఇంటెలెజెన్స్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఎక్స్​ప్రైజ్​ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సింగ్యూలారిటీ యూనివర్సిటీ ఫౌండర్ ​డా.పీటర్ హెచ్​.డైమాండీస్​ అన్నారు. శనివారం హైదరాబాద్​ లో జరిగిన ఫిక్కీ 93వ వార్షిక సదస్సులో భాగంగా ది ఫ్యూచర్ ఈజ్​ నౌ అనే అంశంపై ఆయన మాట్లాడారు. కొవిడ్​ 19 వల్ల ఆర్ధిక, ఆరోగ్యపరమైన సమస్యలను తెచ్చిపెట్టిందన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో పెద్ద సమస్యలను గుర్తించి వాటి వ్యాపార అవకాశాలుగా మలుచుకోవాలన్నారు. విలక్షణత, సమృద్ధి, దీర్ఘకాలం, తీవ్ర సమస్యకు అత్యాధునిక పరిష్కారం.. ఈ రకాల మనస్తత్వాలు ప్రధానంగా ఉంటాయన్నారు. ఫిక్కీ ప్రెసిడెంట్​ డా.సంగీతారెడ్డి మాట్లాడుతూ.. కంప్యూటీకరణ, నోట్ల రద్దు, ప్రజాస్వామ్యం పట్ల పీటర్​ కు అపార పరిజ్ఞానం ఉందని కొనియాడారు.

Next Story

Most Viewed