అధికారుల ఒత్తిడి.. మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

by  |
అధికారుల ఒత్తిడి.. మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
X

దిశ, ఖమ్మం : దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి గ్రామ సర్పంచ్.. అధికారుల ఒత్తిడి తలాలేక ఆత్మహ్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి, దమ్మపేట ఎంపీడీవో తనను ప్రతీసారి పంచాయతీ నిధుల ఖర్చుపై తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు తెలిపారు. ఖర్చు చేసిన లెక్కలను ఆడిట్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.

ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆమె తెలిపారు. ఒక నిరుపేద సర్పంచ్ అయిన తాను.. సొంత ఖర్చులతో తన పంచాయతీని అభివృద్ధి చేస్తున్నా, తనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన సర్పంచ్‌ను హుటాహుటిన దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం చర్చనీయాంశంగా మారింది.

Next Story