- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్చేసుకొని అనివార్య కారణాలతో రద్దు చేసుకుంటే ఆర్నెళ్ల లోపు ఫీజు వాపసు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ద్వారా చెల్లించిన స్టాంపు డ్యూటీని వాపసు చేయనున్నారు.
ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో ఈ ఆప్షన్లేకపోవడంతో స్లాట్లు రద్దు చేసుకున్న వారు చెల్లించిన సొమ్ముపై సంశయం కొనసాగింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో సమస్యకు పరిష్కారం లభించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్టాంప్స్అండ్రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి ఇప్పించే బాధ్యతను కలెక్టర్లపై పెట్టారు. ఆర్నెళ్లు దాటితే ఆ బాధ్యతను రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చూస్తారు.