- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తండ్రి అనే పదానికే మాయని మచ్చతెచ్చాడు ఓ ప్రబుద్దుడు. వావి వరసలు మరచి, కన్న కూతురు కరోనా లక్షణాలతో బాధపడుతోందన్న కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. బెల్లందూరుకు చెందిన 41 ఏళ్ల రాకేష్కు మొదటి భార్యతో గొడవ పడి రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు(19) నెల రోజుల క్రితం తండ్రి దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి యువతి కరోనా లక్షణాలతో బాధపడుతుంది.
కరోనా ట్యాబ్లెట్లు అంటూ తండ్రి నిద్ర మాత్రలు ఇచ్చాడు. దీంతో అవి వేసుకున్న యువతి గాఢ నిద్రలోకి జారుకుంది. అనంతరం ఆమెపై తండ్రి అత్యాచారం చేశాడు. నిద్ర నుంచి తెరుకున్న యువతి కన్నతండ్రే తనపై అత్యాచారం చేయడంతో కన్నీరుమున్నీరైంది. జరిగిన విషయం సవతి తల్లికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో యువతి తన స్నేహితురాలి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.