విస్తుపోయే విషయం.. అలేఖ్య నాలుకను తినేసిన పద్మజ !

by  |
విస్తుపోయే విషయం.. అలేఖ్య నాలుకను తినేసిన పద్మజ !
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4రోజుల క్రితం పురుషోత్తం, పద్మజ దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం పోలీసుల విచారణలో పురుషోత్తం విస్తుపోయే విషయాలను వెల్లడించాడు. తనను తాను కాళికగా ఊహించుకున్న నా భార్య పద్మజ.. పెద్ద కూతురు అలేఖ్యను హత్య చేసిన తర్వాత ఆమె నాలుక కోసి తినేసిందని పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తుండగా.. పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

పూర్వ జన్మలో తాను అర్జునుడినని అలేఖ్య చెప్పేదని పోలీసులకు తెలిపిన పురుషోత్తం.. కాలేజీలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదు.. పాండవుల తరుపున అర్జునుడు ముందుండి నడిపినట్లుగా నీ పోరాటం కొనసాగించాలని… నా కూతురు అలేఖ్య చెప్పేదని పురోషోత్తం స్పష్టం చేశారు. నా కూతురు చెప్పినవన్నీ నిజమేనని, నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనే ఈ విషయాలే ఉన్నట్లు వైద్యులకు వివరించాడు. తిరుపతి రుయా ఆస్పత్రిలో పద్మజ మంత్రాలు జపిస్తూ.. జైల్లో తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదు, నా బిడ్డలు తిరిగి వస్తున్నారు ఇంటికి వెళ్లాలని డాక్టర్ల ప్రశ్నలకు జవాబిచ్చారు.



Next Story

Most Viewed