కన్న తండ్రే మృత్యువయ్యాడు.. పిల్లలకు చంపేందుకు..!

by  |
poison
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. కళ్లల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన తండ్రే ఆ పిల్లల పాలిట మృత్యువులా మారాడు. పాలల్లో విషం కలిపి పిల్లలకు తాగిచ్చి ఆ తర్వాత తానూ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. కుటుంబ కలహాల నేపథ్యంలోనే మొల్లి శ్రీను అనే వ్యక్తి తన పిల్లలు అను(14), చరణ్ (10)లకు విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించాడు.

ఆ తర్వాత తానూ తాగాడు. హుటాహుటిన వీరిని ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు ప్రాణాపాయం లేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed