కొడుకు వెంటే తండ్రి

by  |
కొడుకు వెంటే తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి కూడా తనవు చాలించాడు. బండి ఆత్మకూరు మండలం ఏ. కోడూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుండె నొప్పితో కొడుకు వెంకటకృష్ణ మృతి చెందాడు. అయితే కొడుకు మృతి తట్టుకోలేక తండ్రి వెంకటేశ్వర్లు చనిపోయాడు. అయితే, కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకోవడానికి వైద్యులు నిరాకరించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.

Next Story