చేపలు పట్టడానికి వెళ్లి.. బావిలో శవాలై తేలారు..

by  |
చేపలు పట్టడానికి వెళ్లి.. బావిలో శవాలై తేలారు..
X

దిశ, నిజామాబాద్: సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన ఓ తండ్రి, కొడుకు బావిలో శవాలై తేలిన ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని లింగాపూర్ గ్రామ శివారులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం..కామారెడ్డి శివారులోని దేవునిపల్లి గ్రామం దత్తాత్రేయ గుడి సమీపంలో నివసిస్తున్న షేక్ మీరా(32) అతని కొడుకు మౌలానా(6)తో కలిసి చేపలు పట్టడానికి లింగపూర్ శివారులోని పెద్ద చెరువుకు చేరుకున్నాడు.శనివారం మధ్యాహ్నం వెళ్లిన తండ్రి కొడుకులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్ల గాలింపు చేపట్టారు. అదే రోజు గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో వెతకడం ఆపి, తెల్లవారు జామున మరల ప్రయత్నించగా వారు బావిలో శవాలై కనిపించారు. అయితే షేక్ మీరాకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుందని సమాచారం. చేపలు పట్టేందుకు వెళ్లిన క్రమంలోనే ఫిట్స్ వచ్చి సమీపంలోని బావిలో పడి ఉంటాడని, తండ్రిని కాపాడే క్రమంలో కొడుకు కూడా అందులో పడి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య సబియా బేగం, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.



Next Story

Most Viewed