ఉదయాన్నే బయటకు వెళ్లిన తండ్రి కొడుకులు.. అంతలోనే ?

by  |
ఉదయాన్నే బయటకు వెళ్లిన తండ్రి కొడుకులు.. అంతలోనే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో సంతోషంగా ఉదయాన్నే పనినిమిత్తం బయటకు వెళ్లిన తండ్రి కొడుకులను మృత్యువు వెంటాడింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో చోటు చేుకుంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బాలయ్య గౌడ్(65), శివకుమార్ (32) గా గుర్తించారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story