చేపల వేటకు వెళ్లి నేలరాలిన తండ్రీకొడుకులు

by  |
చేపల వేటకు వెళ్లి నేలరాలిన తండ్రీకొడుకులు
X

దిశ, ధర్మపురి : చేపల వేటకు వెళ్లిన తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్​శివారులోని గోదావరి నదిలో గల దేవతల మడుగు వద్ద శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ధర్మపురికి చెందిన మత్సకారులు భాకి రాజనర్సు (60), కొడుకు భాకి మహేందర్​(26) పిడుగు పాటుకు గురయ్యారు. ఉదయం నదిలో వలలు కట్టి సాయంత్రం విప్పేందుకు నీటిలో దిగారు.

సరిగ్గా ఆ సమయంలోనే పిడుగు పడటంతో నీటిలోనే తండ్రీకొడుకులు ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నీటిలోని మృత దేహాల కోసం గాలించారు. మొదట తండ్రి రాజనర్సు మృతదేహం దొరకగా, కొడుకు మహేందర్​మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.



Next Story

Most Viewed