ఆర్టీసీ బస్సు కింద పడిన తండ్రీకొడుకులు..

by  |
ఆర్టీసీ బస్సు కింద పడిన తండ్రీకొడుకులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ద్విచక్రవాహనం అదుపు తప్పి ఆర్టీసీ బస్సు కింద పడిన ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదం హన్మకొండ పరిధిలోని నక్కలగుట్ట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మృతులు బాలసముద్రానికి చెందిన గజ్జల సంజీవ్, రూపేష్‌లుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed