- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరు సీరియస్!
<p>దిశ, వెల్గటూరు : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది. కారు ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కోడిపుంజుల తిరుపతి భార్య మనోజ, కొడుకు రిషిత్ పరిస్థితి విషమంగా ఉండగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందగా వీరి […]</p>

X
దిశ, వెల్గటూరు : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది. కారు ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కోడిపుంజుల తిరుపతి భార్య మనోజ, కొడుకు రిషిత్ పరిస్థితి విషమంగా ఉండగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందగా వీరి తండ్రి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ధర్మపురి మండలం దమ్మన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






