అడ్వకేట్స్ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్..?

by  |
అడ్వకేట్స్ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హై కోర్టు అడ్వకేట్లు వామన్ రావు, నాగమణిల హత్య కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ప్రతిపాదనలు పంపించింది. శుక్రవారం ఈ మేరకు హైకోర్టు రిజిస్టారర్‌కు లేఖను రాసింది. కరీంనగర్ జిల్లాలో సెషన్స్ కోర్టులో ఈ కేసును ప్రత్యేకంగా విచారించేందుకు ఏర్పాటు చేయాలని కోరింది. డీజీపీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని విన్నవించింది.



Next Story

Most Viewed