- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పరిగి: రెండ్రోజులుగా తిరుగుతున్నా.. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పరిగి మండలం హైదరాబాద్–బీజాపూజర్ అంతర్ రాష్ర్ట రహదారిపై విద్యారణ్య పురిగేటు వద్ద రోడ్డుకు అడ్డంగా బండరాళ్లను పెట్టి రైతులు రైతులు బైటాయించారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో హైవేపై వెళ్తున్న కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రైతులతో మాట్లాడి రైతులు ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. సిలిల్ సప్లయ్ చైర్మన్, కమిషనర్తో మాట్లాడామని, ఎక్కడికక్కడే పంక్షన్ హాల్స్ మాట్లాడి డీఎం ఆధ్వర్యంలోనే ధాన్యం కొనుగోలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అనంతరం విషయం తెలిసిన పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యన్ని కూడా కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు ఎమ్మెల్యేలు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు.